పేద కుటుంబానికి CMRF చెక్కు
NEWS Apr 28,2026 02:47 pm
సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన క్యాతమ్ పెద్ద పర్వన్న అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్ఓసీ చెక్కును అందజేశారు. ఆయన సహకారంపై గ్రామస్థులు అభినందనలు తెలిపారు.