నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
NEWS Apr 28,2026 11:04 am
మహారాష్ట్ర నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. బాధితురాలికి బుర్కా ధరించడం, నమాజ్ చేయడం నేర్పించి, ‘హానియా’గా పేరు మార్చే ప్రణాళిక కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారానికి మాలేగావ్, మలేషియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధితురాలిని మలేషియాకు పంపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. నిదా ఖాన్ ఇంకా పరారీలో ఉండగా, ముందస్తు బెయిల్పై కోర్టు ఉపశమనం నిరాకరించి విచారణను మే 2కు వాయిదా వేసింది.