తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
NEWS Apr 28,2026 10:52 am
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటింది. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నిప్పుల కొలిమితో అటు మనుషులు, ఇటు మూగజీవాలు విలవిలలాడుతున్నాయి.