ఎమ్మిగనూరు: టీడీపీలో భారీ చేరికలు
NEWS Apr 27,2026 08:43 pm
ఎమ్మిగనూరులో టీడీపీలో భారీగా చేరికలు. డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో కటికెగేరి ప్రాంతంలోని 9, 10, 11వ వార్డులు, పలు బూత్ల పరిధిలోని సుమారు 500 మంది వైసీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.