104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Apr 27,2026 08:41 pm
మంత్రాలయంలో 104 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డిని కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు, గ్రాడ్యుటీ డబ్బులు వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందించారు. డ్రైవర్లకు ఐదుేళ్లు పూర్తైతే స్లాబ్ అమలు చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల కనీస వేతనం 18,500 రూపాయలకు పెంచాలని కోరారు. ప్రతి డివిజన్కు బఫర్ సిబ్బంది నియామకం, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు.