తిరుపతి రూరల్ పరిధిలోని ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి పెట్రోల్ కొరత వార్తలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక్కో ద్విచక్ర వాహనానికి లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేశారు. ఉదయం నుంచి భారీ సంఖ్యలో వాహనదారులు బంక్ వద్దకు చేరుకున్నారు. సుమారు 5 వేల మందికి పెట్రోల్ అందజేసినట్లు తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు తగ్గించడమే లక్ష్యమని రాజేశ్ రెడ్డి చెప్పారు.