60ఏళ్ల తర్వాత కార్మికులకు పెన్షన్!
NEWS Apr 27,2026 02:13 pm
కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన (APY) పథకానికి అర్హులు అప్లై చేసుకోవచ్చు. 18 - 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పథకంలో చేరి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. వయసును బట్టి నెలవారీ చందా మారుతుంది. సభ్యుడు మరణించినా జీవిత భాగస్వామికి, తరువాత నామినీకి కార్పస్ అందుతుంది. పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్లో నమోదు చేసుకోవచ్చు.