అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
NEWS Apr 27,2026 01:52 pm
నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులు శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. జిల్లా ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసినట్లు అధికారులు తెలిపారు.