ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వినతి
NEWS Apr 27,2026 01:50 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు వుజారం మహేష్ తెలిపారు. పెండింగ్ బకాయిల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.