కేసీఆర్ పార్టీ @ 25 వసంతాలు
NEWS Apr 27,2026 10:10 am
కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి పాతికేళ్లు పూర్తయ్యాయి. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన ఈ పార్టీ, 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్త విస్తరణ లక్ష్యంతో 2022లో బీఆర్ఎస్గా మారింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి, 2024 లోక్సభలో పరాజయం చవిచూసింది. నేడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుగుతన్నాయి. తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.