ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపనలో ప్రమాదం
NEWS Apr 26,2026 03:04 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారి ప్రాంతంలో ధ్వజస్తంభం పునః ప్రతిష్టాపన సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుండగా ధ్వజస్తంభం అకస్మాత్తుగా విరిగి పడటంతో ఒక చిన్నారి, ఒక మహిళ గాయపడ్డారు. చిన్నారికి తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమం నిర్వహణలో తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.