కరీంనగర్లోని ఖాన్పురా ప్రాంతంలోని సెలూన్కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా అంటావా?” అంటూ అధికార మదంతో రాముపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వీడియో వైరల్గా మారడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలాంటి ప్రవర్తన చేయడం ఆందోళనకరమని అభిప్రాయపడుతున్నారు.