ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్
NEWS Apr 25,2026 03:31 pm
గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల సంతకం చేశారు. అధికార ప్రకటన వెలువడనుంది. గవర్నర్ కోటా నియామకాలపై గత 3ఏళ్ల వివాదం కొలిక్కి వచ్చింది. ఏప్రిల్ 30లోగా మండలి సభ్యత్వం రాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోయే పరిస్థితి ఉండటంతో సీఎం రేవంత్ ఇటీవల గవర్నర్ను త్వరిత నిర్ణయం తీసుకోవాలని కోరారు.