దుబాయ్ ప్రభుత్వ సేవల్లో AI
NEWS Apr 25,2026 03:22 pm
దుబాయ్: 2028కి ప్రభుత్వ సేవల్లో 50% వరకు ఏజెంటిక్ AI ని అమలు చేయనున్నట్లు UAE ప్రధాని మహ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తం చెప్పారు. AI ఇక నిర్ణయ ప్రక్రియలో భాగస్వామిగా మారుతుందని, సేవల వేగం, పారదర్శకత, సామర్థ్యం పెంచడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉపయోగించే తొలి దేశంగా UAE నిలవనుంది. లక్ష్యాలను స్వయంగా విశ్లేషించి చర్యలు చేపట్టే ఏజెంటిక్ ఏఐ ప్రభుత్వ పాలనలో పెద్ద మార్పుకు దారితీయనుందని టెక్ నిపుణుల అంచనా.