'యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు'
NEWS Apr 25,2026 06:15 am
జగిత్యాల: రాయికల్ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు, GMR వరలక్ష్మి, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి అందజేశారు. యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చని విద్యాసాగర్రావు అన్నారు. హాస్టల్ కోసం ఎమ్మెల్యే ₹30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.