మేడ్చల్: మునీరాబాద్ సభలో కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల మనిషి కాదని, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు కనిపించడం లేదని, ఆయన గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీలా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజకీయ పరిపక్వత కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఇళ్లు కూల్చివేతల సమయంలో కేసీఆర్ స్పందించలేదని కూడా ఆరోపించారు.