తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ వేదిక ఏర్పాటు చేసిన సభలో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించారు. పార్టీ జెండాలో ‘నీలి’ రంగును ఖరారు చేశారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తా మంటున్నారు. గాంధీజీ సర్వోదయ కాన్సెప్ట్ ఆధారంగానే తమ పార్టీ ఎజెండా ఉంటుందన్నారు.