మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
NEWS Apr 24,2026 10:06 pm
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. పవిత్ర తుంగభద్రా తీరం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సహాయ పీఆర్వో వ్యాసరాజ్ ఆచార్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై దర్శనం పొందారు.