మైనర్ల డ్రైవింగ్పై కఠిన చర్యలు
NEWS Apr 24,2026 09:53 pm
మంత్రాలయం సీఐ ఎం. దస్తగిరి బాబు మాధవరం గ్రామంలో ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో చిన్నపిల్లలను ఈతకు వెళ్లనివ్వొద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రమాదాలు జరిగితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. ఇంట్లో బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకులో భద్రపరచాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలవొద్దని ప్రజలకు సూచించారు.