పోలీసులకు డీఐజీ ప్రశంసా పత్రాలు
NEWS Apr 24,2026 09:55 pm
ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో వివిధ కేసులను త్వరితగతిన ఛేదించి ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని డీఐజీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా ప్రశంసించారు. వారి సేవలను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, ఎమ్మిగనూరు డీఎస్పీ మరివాడ భార్గవి పాల్గొన్నారు.