సూరత్కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో రూ.35,000 వ్యయంతో దీనిని తయారు చేశాడు. స్మార్ట్ఫోన్ లేదా రిమోట్ ద్వారా నియంత్రించగల ఈ సైకిల్ ముందుగా నిర్ణయించిన మార్గంలో ప్రయాణిస్తూ అడ్డంకులను సెన్సర్లతో గుర్తించి దారి మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంది. రోడ్డుపై మనిషి లేకుండానే కదులుతున్న ఈ సైకిల్ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది.