ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని సీఎం చెప్పారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరుపుతుందని, కార్మికులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.