టూరిస్టుల సెర్చ్ల్లో ఫస్ట్ ప్లేస్ తిరుపతి
NEWS Apr 23,2026 11:12 pm
బెంగళూరులో ఇటీవల Federation of Hotels & Restaurants Associations సమావేశంలో 2047 నాటికి భారత టూరిజంపై చర్చ సందర్భంగా టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రదేశాన్ని సెర్చ్ చేస్తున్నారనే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. గోవా, ఊటీ, కులు-మనాలి, జమ్మూ కశ్మీర్ వంటి ప్రదేశాలను దాటేసి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. భక్తి ఆధారిత ప్రయాణాలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.