డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ప్రాణాలకు తెగిస్తున్నారు. నర్సంపేట బస్ డిపోలో డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. MGMలో చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం శంకర్గౌడ్ను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మరణించారు. అటు మిర్యాలగూడలో వెంకన్న అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. భద్రాచలంలో డ్రైవర్ లింగారెడ్డి గడ్డి మందు తాగడం కలకలం రేపింది. ప్రభుత్వ తీరు వల్లే కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.