మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం తాళాలు వేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు.