మల్లారెడ్డిలో డిజిటల్ AI ఏజెన్సీ క్యాంపస్
NEWS Apr 23,2026 05:16 pm
మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే తొలిసారిగా ‘డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్’ పేరిట ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మల్లారెడ్డి విద్యా సంస్థల ఛైర్మన్, మేడ్చల్ ఎమ్మల్యే చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. ఈ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడిని ఆహ్వనించినట్లు తెలిపారు. జూన్లో గూగుల్ సహకారంతో అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.