'యశోద'లో యూరాలజీ సేవలు: గోపీచంద్
NEWS Apr 23,2026 05:17 pm
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ వైద్య సేవలను వివరించారు. జనాభాలో 5% మంది కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నారని, తొలిదశలో గుర్తిస్తే ఆపరేషన్ అవసరం లేదని ఆయన తెలిపారు. యశోద హాస్పిటల్ లో రోబోటిక్ ఎక్స్ రే వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం లభిస్తుందని, కిడ్నీ క్యాన్సర్ కు రోబోటిక్ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని డాక్టర్ గోపీచంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశోద సిబ్బంది పాల్గొన్నారు.