పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం..
కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన
NEWS Apr 23,2026 01:18 pm
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇంధన ధరల పెంపుపై ప్రభుత్వం వద్ద ప్రతిపాదన లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, గత నాలుగేళ్లుగా దేశంలో ధరలను నియంత్రించగలిగామని పేర్కొంది. పన్నుల తగ్గింపు వంటి చర్యలతో సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించింది.