వెళ్లిపోతామంటున్న 40% ఎన్నారైలు
NEWS Apr 23,2026 12:41 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న కఠిన వలస విధానాలపై ఎన్నారైలో అసంతృప్తి పెరుగుతోంది. కార్నోగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వే ప్రకారం 40% మంది ఎన్నారైలు శాశ్వతంగా అమెరికా విడిచిపోవాలని ఆలోచిస్తున్నారట. రాజకీయ అస్థిరత కారణమని 58% మంది తెలిపారు. అలాగే ట్రంప్ పాలనపై 71% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు Cato Institute నివేదిక ప్రకారం H-1B వీసాల జారీ 25% తగ్గగా, విద్యార్థి వీసాలు కూడా పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో 54 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారు.