అలర్ట్: రాజమండ్రిలో పులి సంచారం
NEWS Apr 23,2026 10:23 am
రాజమండ్రి సమీపంలోని కోరుకొండ (మం) కాపవరం పరిధిపాండవుల మెట్టపై పెద్ద పులి సంచరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మెట్ట ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన అటవీశాఖ అధికారులు, ఆ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పులి కదలికలను గమనించే సిబ్బందిని, ఏర్పాటు చేసి స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.