నేటి నుంచి ఆర్టీసీ మహా ధర్నా
NEWS Apr 23,2026 10:18 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజూ కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని జేఏసీ తేల్చి చెప్పింది. సకల జనుల సమ్మె తరహాలో నేటి నుంచి పోరుబాట పట్టాలని కార్మికులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్షాపుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది.