నందవరంలో రీసర్వే అవగాహన ర్యాలీ
NEWS Apr 23,2026 10:07 am
నందవరం గ్రామపంచాయతి ఆధ్వర్యంలో రీసర్వే పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురురాజ్ దేశాయ్ పాల్గొని మాట్లాడుతూ, గతంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో కొంతమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రీసర్వే పనులు సజావుగా సాగేందుకు అధికారులు–రైతులు పరస్పరం సహకరించాలని కోరారు. ఈ ర్యాలీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు.