త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
NEWS Apr 22,2026 07:42 pm
అమరావతి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా APUWJ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు ఆయనను సన్మానించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వెటరన్ జర్నలిస్టులకు ప్రత్యేక బస్సు పాసులు అందించడంతో పాటు, రికార్డు స్థాయిలో అక్రిడిటేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.