పట్టణ అభివృద్ధికి మరో అడుగు
NEWS Apr 22,2026 07:45 pm
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ఈ దుకాణాలు ఉపయోగపడతాయని, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గట్టు అల్తాఫ్, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.