అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
NEWS Apr 22,2026 07:45 pm
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు అందుబాటులో ఉన్నాయని గ్రామస్తులకు వివరించారు. అలాగే ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి ప్రభుత్వ సదుపాయాలను తెలియజేశారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.