మంత్రాలయంలో పెట్రోల్ సంక్షోభం
NEWS Apr 22,2026 07:43 pm
కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పట్టణంలో ఉన్న 2 పెట్రోల్ బంక్లలో 2రోజులుగా “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు, రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఇంధనం కోసం పలుచోట్ల తిరగాల్సి వస్తోంది. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.