కరీంనగర్లో లారీని ఢీకొట్టిన RTC బస్సు
ప్రైవేటు డ్రైవర్తో నడిపిస్తుండగా ప్రమాదం
NEWS Apr 22,2026 11:37 am
కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్తో నడిపిస్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.