కేసీఆర్, హరీష్ రావుకు ఊరట
NEWS Apr 22,2026 11:34 am
హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని పేర్కొన్నప్పటికీ, ఆ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో స్మిత సబర్వాల్, ఎస్కే జోషికి కూడా ఉపశమనం కలిగింది. ప్రభుత్వ జీవో నంబర్ 6ను సమర్థించిన హైకోర్టు, కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చకు ముందే మీడియాకు విడుదల చేయడాన్ని తప్పుబట్టింది.