రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు కార్మికులు. ప్రజా శ్రేయస్సు దృష్ట్య సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. నలుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 4 వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. సమ్మె విరమించాలని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా' అని మంత్రి అన్నారు.