అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో జరిగిన ఘటనపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య స్పందించారు. సుధాకర్ గడ్డి వాములకు నిప్పు పెట్టిన ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎస్ఐ ఆంజనేయులు నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఈ సమయంలో గ్రామస్థులు వందల సంఖ్యలో చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. స్టేషన్ వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఎస్ఐ చేసిన చర్యలను దళితులపై దాడిగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. ఎస్ఐ జోక్యం లేకపోతే సుధాకర్ ప్రాణాలు ప్రమాదంలో పడేవని పేర్కొంటూ, పోలీసులకు మద్దతు ప్రకటించారు.