సమ్మెకు సైరన్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
NEWS Apr 21,2026 10:03 pm
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి డిమాండ్ల సాధన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు తెలిపారు. 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు.