తెలంగాణ రాష్ట్రానికి 8 కొత్త రైళ్లు!
NEWS Apr 21,2026 09:50 pm
రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్లకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైళ్లన్నీ వారానికి ఒకసారి నడుస్తాయి. తెలంగాణకు 8 రైళ్లను కేటాయించినందుకు ప్రధానికి, రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.