కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పెరిగినా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ట్రాలీని వెనక్కి తీసుకెళ్లి డ్రైనేజీ కాలువలో వదిలివేశాడు. దీంతో మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకట్ట పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం నుండి తప్పించాడని డ్రైవర్ను స్థానికులు అభినందించారు.