రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
NEWS Apr 21,2026 09:52 pm
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల పురోగతిపై ఈ సమావేశంలో సమీక్ష జరిగింది. జోనల్ ఇంచార్జి పుష్పలత అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి మార్గదర్శనం చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ మండలాల వారీగా నిర్వహించిన శిక్షణ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జోనల్ నాయకులతో పాటు కర్నూలు నుంచి సునీల్ రెడ్డి, గీతా మాధురి, మాలతి తదితరులు పాల్గొన్నారు.