ప్రమాదవశాత్తు ఫైర్ పైప్లైన్కు లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బూర్గంపాడు మం. ముసలమడుగు గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన వెంటనే పైప్లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు ఎగసిపడుతూ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. డ్రైవర్ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీసీ గేటు ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు.