కేసీఆర్కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగర్ మధుప్రియ స్పష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆమె, తన గాత్రంతో సభికులను ఉర్రూతలూగించడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. \"మళ్లీ బాపు రావాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలి\" అంటూ ఆమె పాడిన పాట సభలో మార్మోగింది.