శిక్షణ కోసం సింగాపూర్కు మంత్రులు
NEWS Apr 21,2026 11:18 am
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన విధానాలు, పారదర్శకత, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా ఈ పర్యటన నిర్వహిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో నాయకత్వ సూత్రాలు, రాజకీయ జవాబుదారీతనం అంశాలపై మంత్రులు అవగాహన పొందనున్నారు. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సింగపూర్ నమూనాను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.