జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలో కొత్తగూడెంకు చెందిన సీనియర్ కార్యకర్త ముల్పురి ప్రసాద్ (పెదబాబు)ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఫారెస్ట్ శంకర్ ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ముల్పురి ప్రసాద్ పార్టీ అభివృద్ధికి ఎన్నో ఏళ్ల సేవలను కొనియాడిన ఫారెస్ట్ శంకర్, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి ఆయన సేవలు మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.