కవిత నూతన పార్టీ పోస్టర్ ఆవిష్కరణ
NEWS Apr 20,2026 11:01 pm
పిట్లం మండలంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఈనెల 25న ప్రారంభం కానున్న పార్టీకి సంబంధించిన పోస్టర్ను స్థానిక జాగృతి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త పార్టీ లక్ష్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, యువత సాధికారత వంటి అంశాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. జాగృతి జిల్లా యూత్ అధ్యక్షుడు ఆదిల్, మండల జాగృతి అధ్యక్షుడు నీలకంటి మనోహర్, మండల అధ్యక్షుడు అభ్యాన, యూత్ ప్రెసిడెంట్ అబ్రార్, సభ్యులు ప్రశాంత్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.