ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం స్ఫూర్తితో ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ పటమటలో అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. కేవలం రూ.5లకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలా భోజనం అందిస్తారని చెప్పారు.